Anantapur: అనంతపురం జిల్లా గుత్తి ఉపకారాగారంపై అవినీతి ఆరోపణలు!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి ప్రత్యేక ఉపకారాగారంలో అవకతవకలు. ముద్దాయిలను కలవడానికి వచ్చే బంధువుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 July 2026 11:34 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి ఉపకారాగారంపై అవినీతి ఆరోపణలు!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలోని ప్రత్యేక ఉపకారాగారంలో ముద్దాయిలను కలవడానికి వచ్చే బంధువుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లోపల ఉన్న ముద్దాయిలతో మాట్లాడేందుకు వచ్చిన బంధువులు, జైలులో ఉన్న పోలీస్ అధికారులకు "మామూలు" ఇవ్వకపోతే లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు. డబ్బు ఇస్తేనే కలవడానికి అనుమతిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇది చాలా రోజులుగా కొనసాగుతుందని, పేద బంధువులు డబ్బు లేక తమవారిని కలవలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై జైలు అధికారులను సంప్రదించగా వారి వివరణ ఇంకా రావాల్సి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story