Anantapur: గుత్తిలో మూడో రోజుకు దస్తవేజు లేఖర్ల సమ్మె!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలో మూడో రోజుకు చేరిన దస్తవేజు లేఖర్ల నిరసన. జీవో 396 రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించాలని డిమాండ్.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 July 2026 11:12 AM IST
Anantapur
X

Anantapur: గుత్తిలో మూడో రోజుకు దస్తవేజు లేఖర్ల సమ్మె!

Anantapur: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దస్తవేజు లేఖర్ల సమ్మె మంగళవారంతో మూడో రోజుకు చేరింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జిఓ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తవేజు లేఖర్లు ఆందోళన నిర్వహించారు. "రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వద్దు - డాక్యుమెంట్ రైటర్లు ముద్దు" అంటూ నినాదాలు చేశారు.

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని, జిఓను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో శ్రీకరం నరేష్ బాబు, బండి సత్య, అనంతయ్య, బండి నిరంజన్, రంగస్వామి, రమణ, హరిబాబు, సాయి రంగస్వామి, రామకృష్ణ, తాజుద్దీన్, రవి, రాయల్, రఘువీర్, సాయి తదితర దస్తవేజు లేఖర్లు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story