Pamidi: డ్రైనేజ్ కాలువల పనులు వెంటనే చేపడతాం!

Pamidi: పామిడి మండలం రామగిరి ఎగువ తాండాలో పారిశుద్ధ్య సమస్యలపై డిప్యూటీ ఎంపీడీవో అశ్వత్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేసి, డ్రైనేజ్ పనులు చేపడతామని హామీనిచ్చారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 7 Aug 2026 11:37 AM IST
Pamidi
X

Pamidi: డ్రైనేజ్ కాలువల పనులు వెంటనే చేపడతాం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తాండ గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై డిప్యూటీ ఎంపీడీవో అశ్వత్ నాయుడు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు.

గ్రామంలోని ప్రధాన రోడ్లు, వీధులు, డ్రైనేజ్ కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురికి నీరు నిలిచి ఉండటం, చెత్త పోగుపడి ఉండటాన్ని గమనించిన అశ్వత్ నాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజ్ కాలువల పనులను వెంటనే చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు.

పారిశుద్ధ్య సిబ్బంది రోజూ విధులు నిర్వహించాలని, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేయించాలని సూచించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.

ఈ తనిఖీలో గ్రామపంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story