Pamidi: పామిడిలో ఘనంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞం: కర్మయోగంపై ప్రవచనం
Pamidi: అనంతపురం జిల్లా పామిడి శ్రీ అనఘా ఆలయంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞం ఘనంగా జరిగింది. కర్మయోగంపై స్వామి వారి ప్రవచనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Pamidi: పామిడిలో ఘనంగా భగవద్గీత జ్ఞాన యజ్ఞం: కర్మయోగంపై ప్రవచనం
పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ అనఘా ఆలయం ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం లో ఆత్మీయంగా "చిన్మయ మిషన్" ఆధ్వర్యంలో గీత జ్ఞాన యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ గురు దత్త సేవ సమితి ఆలయ కమిటీ సభ్యులు M H లక్ష్మీనారాయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భగవద్గీత మూడవ అధ్యాయం *'కర్మయోగం' పై ప్రత్యేక ప్రవచనాలు జరిగాయి.
ఈ సందర్భంగా చిన్మయ మిషన్ స్వామి మాట్లాడుతూ, మానవుడు ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా ఆచరించడమే కర్మయోగమని తెలిపారు. భగవద్గీతలోని సందేశాలను జీవితంలో ఆచరిస్తే మానవ జీవితం ధన్యమవుతుందని భక్తులకు సూచించారు.
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశాల మేరకు ఈ గీత జ్ఞాన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ తెలిపారు. స్వామీజీ ఆశీస్సులతో ప్రతి నెలా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పామిడి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గీత పారాయణం చేసి, స్వామి ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు. చివరలో అన్నప్రసాద వితరణ జరిగింది.




