Andhra Pradesh: వికసిత్ భారత్ లక్ష్యంలో యువతే కీలకం.. BJYM!
Andhra Pradesh: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh: వికసిత్ భారత్ లక్ష్యంలో యువతే కీలకం.. BJYM!
Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో సమూలమైన మార్పుల దిశగా ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి అన్నారు. 2047 నాటికి భారత్ స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో.. అప్పటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని సునీల్ రెడ్డి పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లోనే ఉందని.. యువతలో ఉన్న ఆలోచనలు, సృజనాత్మకత, నైపుణ్యాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. కేవలం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడకుండా.. కొత్త ఆలోచనలతో స్టార్టప్లు, వ్యాపారాలు, పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని సునీల్ రెడ్డి తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సహజ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సాంకేతికత, విద్య వంటి రంగాలను గుర్తించి వాటి అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కూడా తమ ప్రాంత అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు.
గ్రామాల్లోని ప్రతి యువకుడు, యువతి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని సునీల్ రెడ్డి ఆకాంక్షించారు. గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువత తమ సామర్థ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
2047 వికసిత్ భారత్ లక్ష్యం కేవలం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదని.. దేశంలోని ప్రతి పౌరుడి లక్ష్యంగా మారాలని అన్నారు. ముఖ్యంగా యువత ఈ లక్ష్యాన్ని తమ బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ చూపిస్తున్న అభివృద్ధి మార్గంలో యువత కలిసి నడిస్తే.. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడం సాధ్యమవుతుందని సునీల్ రెడ్డి పేర్కొన్నారు...




