Adilabad: దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలి: యోగానంద సరస్వతి

Adilabad: భారతదేశంలో గోహత్యను నిషేధించాలని, గోమాతను 'రాష్ట్ర మాత'గా ప్రకటించాలని ఆదిలాబాద్‌ కలెక్టరేట్ వద్ద మఠాధిపతి యోగానంద సరస్వతి డిమాండ్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 27 July 2026 12:00 PM IST
Adilabad
X

Adilabad: దేశవ్యాప్తంగా గోహత్యను నిషేధించాలి: యోగానంద సరస్వతి

ఆదిలాబాద్: సంపూర్ణ భారతదేశంలో గోహత్యను నిషేధించాలని మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు.

గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని గోమాత సన్మాన ఆహ్వాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో సంకీర్తనలతో ర్యాలీ నిర్వహించి.. అనంతరం కలెక్టరేట్ వద్ద అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ.. గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సకల దేవతల ఆశీర్వాదం కావాలంటే గోరక్షణ ఎంతో అవసరం అన్నారు.

గోవద నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story