Gudihathnoor: నీటి మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ తీగలు తగిలి వైజాపూర్ వాసి మృతి!
Gudihathnoor: గుడిహత్నూర్ మండలం వైజాపూర్లో నీటి మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ షాక్తో కనక విలాస్ (38) మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.
Gudihathnoor: నీటి మోటార్ ఆన్ చేస్తూ విద్యుత్ తీగలు తగిలి వైజాపూర్ వాసి మృతి!
Gudihathnoor: మండలంలోని వైజాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి కనక విలాస్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నీటి మోటారు ఆన్ చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Next Story




