Gudihathnoor: వీడియో కాల్‌ లో విద్యార్థుల సమస్యలు విన్న ఎమ్మెల్యే

Gudihathnoor: గుడిహత్నూర్ మన్నూర్ పాఠశాల విద్యార్థులతో వీడియో కాల్‌లో మాట్లాడిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. సోషల్ టీచర్ నియామకానికి హామీ.

NAGULA SATISH, BOATH
Published on: 27 July 2026 3:37 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: వీడియో కాల్‌ లో విద్యార్థుల సమస్యలు విన్న ఎమ్మెల్యే

గుడిహత్నూర్:

విద్యార్థుల సంక్షేమానికి, విద్యావ్యవస్థ బలోపేతానికి బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా మన్నూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఆయన నేరుగా వీడియో కాల్‌ ద్వారా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు.

ప్రజాప్రతినిధి స్వయంగా తమతో మాట్లాడటంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో తమ పాఠశాల పరిస్థితిని ఆయనకు వివరించారు.

​ఈ సందర్భంగా పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడు లేకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మన్నూర్ పాఠశాలకు త్వరలోనే సోషల్ టీచర్‌ను నియమించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య, పాఠశాలల్లో మెరుగైన వసతులు అందించడమే తమ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

​ఎమ్మెల్యే స్వయంగా స్పందించి విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా ఇవ్వడం పట్ల విద్యార్థులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story