Adilabad: మాజీ నక్సలైట్ కుర్సంగె మోతి బాయి (రాధాక్క) కన్నుమూత
Adilabad: విప్లవ ఉద్యమ నేత కుర్సంగె మోతి బాయి (రాధాక్క) అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Adilabad: మాజీ నక్సలైట్ కుర్సంగె మోతి బాయి (రాధాక్క) కన్నుమూత
ఆదిలాబాద్: విప్లవోద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలపాటు పనిచేసిన కుర్సంగె మోతి బాయి (రాధాక్క) సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి ఉద్యమ సహచరులు సంతాపం తెలిపారు. రాధాక్క చంద్రన్న సహచరిగా ఉన్నారు.
1984లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్లో చేరిన ఆమె సిర్పూర్ దళంలో సభ్యురాలిగా పనిచేశారు. 1986లో పార్టీ సభ్యత్వం పొందగా.. 1989లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 2000లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో దండకారణ్యానికి బదిలీపై వెళ్లి క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించారు.
గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం దండకారణ్యం నుంచి వెళ్తుండగా పాల్వంచలో అరెస్టయ్యారు. 2013 నుంచి 2016 వరకు తెలంగాణలోని వివిధ జైళ్లలో ఉన్నారు. 2016లో విడుదలయ్యారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సహచరుడితో కలిసి ఉంటూ.. కొంతకాలంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందారు.
రాధాక్క అంత్యక్రియలు సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రోడ్లో వాన్వాట్–మామిడిగూడ మధ్యలోని లింగూగూడలో నిర్వహించనున్నట్లు తెలిపారు.




