YS Sharmila: పేదలకు దక్కాల్సిన స్కీంలు బీఆర్‌ఎస్ దొంగల పాలవుతున్నయని ఫైర్

YS Sharmila: పేదలకు దక్కాల్సిన స్కీంలు బీఆర్‌ఎస్ దొంగల పాలవుతున్నయని ఫైర్

Jyothi
Published on: 14 July 2023 7:47 PM IST
YS Sharmila Comments on CM KCR
X

YS Sharmila: పేదలకు దక్కాల్సిన స్కీంలు బీఆర్‌ఎస్ దొంగల పాలవుతున్నయని ఫైర్

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లుగా కేసీఆర్‌...అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు అనే విధంగా పథకాలను అమలు చేస్తు్న్నారని మండిపడ్డారు. పేదలకు దక్కాల్సిన స్కీంలన్నీ బీఆర్ఎస్ దొంగల పాలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరకు గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో కూడా అక్రమాలకు పాల్పడటం సిగ్గు చేటని వైఎస్ షర్మిల ఆరోపించారు. పట్టాల కోసం దరఖాస్తు పెట్టని వారికి పట్టాలు ఎలా ముట్టజెప్పారని..దీనిపై కమిటీ వేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story