నాకు న్యాయం చేయండి...కూతురుతో కలిసి తల్లి భిక్షాటన

నాకు న్యాయం చేయండి...కూతురుతో కలిసి తల్లి భిక్షాటన
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఓ తల్లి తన కన్నకూతురితో కలిసి భిక్షాటన చేసింది. ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా తన పేరిట ఉన్న భూమిని...

తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఓ తల్లి తన కన్నకూతురితో కలిసి భిక్షాటన చేసింది. ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు. అది సహించలేని ఆ మహిళ ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో భిక్షాటన చేస్తూ నిరసన చేసింది. ఆ తరువాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తన కూతురితో ధర్నా చేసింది. ఈ హృదయాన్ని కలచివేసే ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే 15 ఏళ్ల క్రితం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రంగరాజు అమరావతికి, మధుసూదన్‌కు వివాహం జరిగింది. అయితే సదరు మహిళ తన భర్త, బావ, అత్త, ఆడబిడ్డలపై కుటుంబ కలహాలతో 2012లో హన్మకొండలోని మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు వారందరిపైన కేసు నమోదు చేసారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఓ వైపు తాను పెట్టిన కేసు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్‌ రాజు సదరు బాధితురాలు పేరు మీద ఉన్న వారి పేర రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఈ విషయం అమరావతికి తెలియడంతో వెంటనే ఆమె స్పందించి తనకు న్యాయం చేయాలంటూ తన కూతురుతో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. అది చూసిన స్థానికులు బాలల సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు పరశురాములు, మహేందర్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. చిన్నపిల్లలతో భిక్షాటన చేయడం నేరమని వారించారు. దాంతో బాధితురాలు ఏమి చేయలేక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే దాన్ని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories