వీఐహెచ్ఈ 21వ ఆవిర్భావ వేడుకలకు ఉప-రాష్ట్రపతి వెంకయ్య

వీఐహెచ్ఈ 21వ ఆవిర్భావ వేడుకలకు ఉప-రాష్ట్రపతి వెంకయ్య
x
Highlights

హైదరాబాద్ నగరంలోనే ఎంతో ప్రసిద్ది గాంచిన రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (వీఐహెచ్ఈ) 21 వార్షికోత్సవ వేడుకలకు...

హైదరాబాద్ నగరంలోనే ఎంతో ప్రసిద్ది గాంచిన రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (వీఐహెచ్ఈ) 21 వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద పాల్గొని చారిత్రక ప్రసంగం చేసి ఈ ఏడాదికి 127 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే సెప్టెంబరు 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ 21 వార్షికోత్సవ వేడుకలకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ వేడుకల్లో ఉప-రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మొదటి రోజున అంటే గురువారం సెప్టెంబరు 10వ తేదీన ఉదయం 11.00 గంటలకు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రారంభ, ముగింపు ఉపన్యాసాన్ని పశ్చిమ్ బెంగాల్‌లో బేలూరు రామకృష్ణ మిషన్ అండ్ మఠ్ వైస్-ప్రెసిడెంట్ శ్రీమట్ స్వామీ గౌతమానందజీ చేస్తారు. అదే విధంగా సెప్టెంబరు 11వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి ఉదయం 10.30 గంటలకు గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తారు. ఇక పోతే ఆర్కే మఠ్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనదలచినవారు ముందుగా పేర్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్కే మఠ్ నిర్వాహకులు త్వరలోనే వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.

ఆర్కే మఠ్ ఆధ్వర్యంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హ్యుమన్ ఎక్స్‌లెన్స్‌ను 2000 సంవత్సరంలో ఏర్పాటుచేశారు. పెద్దలు, మధ్య వయస్కులు చిన్నారులు ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాశం, విద్య, భారతీయ, విదేశీ భాషలకు సంబంధించిన వివిధ రకాలు కోర్సులను ఈ ఆర్కే మఠ్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఇక వార్షికోత్సవ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ వక్తలతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. చికాగో ప్రసంగం 127వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంగా చివరి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories