పత్తి రైతుల ఇబ్బందులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

admin1
Updated on: 2 Nov 2019 10:03 PM IST
kishan reddy
X
kishan reddy

తెలంగాణలో పత్తి రైతుల ఇ్బందులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కాటన్ కార్పొరేషన్ ఇండియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని..పత్తి చేతికి వచ్చే టైంకే రాష్ట్రంలో వర్షాలు వచ్చాయన్నారు. రైతులు మద్య దళారులకు కాకుండా నేరుగా సీసీఐ కేంద్రాల్లోనే అమ్మకాలు జరుపాలని సూచించారు. రైతులు కాటన్ డ్రై చేసుకుని వస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. 12 శాతం కంటే కాటన్ తేమ తక్కువ ఉండే విధంగూ చూసుకోవాలన్నారు. పత్తి రైతుల ఇబ్బందులను భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆద్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞాపన పత్రాలు పంపించించామన్నారు.

admin1

admin1

Next Story