వికారాబాద్‌లో యువతి కిడ్నాప్‌

వికారాబాద్‌లో యువతి కిడ్నాప్‌
x
Highlights

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా కిడ్నాప్ కేసులు, అలాగే అదృష్యం కేసులు బయటికి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానగరంలో...

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా కిడ్నాప్ కేసులు, అలాగే అదృష్యం కేసులు బయటికి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానగరంలో ముగ్గురు యువతులు అదృష్యం అయ్యారు. ఈ సంఘటన మరచిపోకముందు నవదంపతులను కిడ్నాప్ చేసి నవ వరుడిని చంపేసిన సంఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలు మరచిపోకముందు తాజాగా వికారాబాద్ లో ఓ కిడ్నాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వికారాబాద్ లోని రోడ్డుపై ఇద్దరు అక్కచెల్లెల్లూ సరదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెలుతున్నారు. సరిగ్గా అదే సమయానికి కొంత మంది దుండగులు వాహనంలో వచ్చి చెల్లెలిని అపహరించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అక్క వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. తమ చెల్లెలిని ఎవరో గుర్తు తెలియని దుండగులు అపహరించారని వెంటనే తమ చెల్లెలిని కాపాడాలని ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు వెంటనే కిడ్నాప్ జరిగిన స్ధలానికి చేరుకున్నారు. ఆయా పరిసర ప్రాంతాల్లో వెతికి తరువాత అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజిలో యువతిని కిడ్నాప్‌ చేసిన దుండగులు ఆమెను తీసుకుని అనంతగిరి వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాస్త దూరం వరకు దుండగులను వెంటాడిన పోలీసులు యువతిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న దుండిగల్ పీఎస్ పరిధిలో ముగ్గురు యువతుల అదృష్యం సంఘటనలు చోటు చేసుకున్నాయి. దుండిగల్ ప్రాంతంలో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు అదృష్యం అవ్వడంతో ఈ కేసులు ఆ ప్రాంత పోలీసులు సవాల్‌గా మారాయి. దుండిగల్‌ లో నివాసం ఉంటున్న శిరీష్ అనే 22 ఏళ్ల యువతి,భారతి అనే 21 యువతి, ఎమ్.పద్మావతి అనే 38 ఏళ్ల మహిళ అదృష్యమయ్యారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories