Kothagudem: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Kothagudem: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు భద్రాద్రి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 3 Aug 2023 4:16 PM IST
Two Tribals Sentenced to Life in Forest Range Officer Srinivasa Rao Murder Case
X

Kothagudem: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Kothagudem: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు భద్రాద్రి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. గత సంవత్సరం నవంబర్‌లో చండ్రగొండ మండలం బెండళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను సందర్శించడానికి వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గొత్తి కోయల చేతిలో వేట కొడవళ్లతో దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసిన ఎర్రబోడు గ్రామానికి చెందిన మడకం తుల, పోడియం నంగాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు ఇద్దరికి చెరొక వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story