టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి
x
Highlights

బుల్లితెర నటి, టీవీ యాంకర్‌ శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్‌నగర్‌ ఇంజినీర్స్‌ కాలనీలో నివాసముంటున్న ఆమె గత నాలుగు రోజులుగా ఇంటి...

బుల్లితెర నటి, టీవీ యాంకర్‌ శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. ఎస్సార్‌నగర్‌ ఇంజినీర్స్‌ కాలనీలో నివాసముంటున్న ఆమె గత నాలుగు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం ఇచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో ఆమె మృత దేహాన్ని గుర్తించారు. ఆమె ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని, నివేదిక ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. విశ్వశాంతి స్వస్థలం విశాఖ జిల్లా అని పోలీసులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories