Nizamabad: డ్రైవర్​కు మత్తు మందు ఇచ్చి.. పసుపు లోడ్​ లారీ హైజాక్

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు లోడ్ తో ఉన్న లారీ దొంగలు ఎత్తుకెళ్లారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 July 2024 11:34 AM IST
Turmeric Lorry Hijacked in Nizamabad
X

Nizamabad: డ్రైవర్​కు మత్తు మందు ఇచ్చి.. పసుపు లోడ్​ లారీ హైజాక్

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు లోడ్ తో ఉన్న లారీ దొంగలు ఎత్తుకెళ్లారు. 50లక్షల రూపాయల విలువైన పసుపు లోడ్ తో గుంటూరు వెళ్తున్న లారీని ఆర్టీఏ అధికారుల పేరుతో దుండగులు అడ్డుకున్నారు. డ్రైవర్ కు మత్తు ఇచ్చి లారీ ఎత్తుకెళ్లారు. అయితే, నవిపేట్ మండలం జన్నేపల్లి దగ్గర ఇతర వాహనాల్లో పసుపు నింపుతుండగా పోలీసులు దాడి చేసి లారీనీ సీజ్ చేశారు. దుండగులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story