
Gandhi Bhavan: గాంధీభవన్లో మ.3 గంటలకు టీకాంగ్రెస్ అత్యవసర సమావేశం.. హాజరుకానున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ థాక్రే, భట్టి
Gandhi Bhavan: తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణపై చర్చ
Gandhi Bhavan: గాంధీభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు టీకాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ థాక్రేతో పాటు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, చేవెళ్ల బహిరంగ సభ, గద్వాల్ సభలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే.. తిరగబడదాం-తరిమికొడదాం కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. ఎన్నికలకు సమాయత్తంపై నేతలకు పీసీసీ దిశానిర్దేశం చేయనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




