పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు

పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు
x
Highlights

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పులిగుండాల ప్రాజెక్ట్ దగ్గర చెరువులోకి ఈతకు దిగిన యువకులు గల్లంతయ్యారు. స్థానికుల తెలిపిన వివరాల...

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పులిగుండాల ప్రాజెక్ట్ దగ్గర చెరువులోకి ఈతకు దిగిన యువకులు గల్లంతయ్యారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 8 మంది స్నేహితుల బృందం పులిగుండాల ప్రాజెక్టు వద్దకు వెళ్లింది. వీరిలో ఐదుగురు ఈతకు దిగారు. నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దర్ని స్థానికులు రక్షించగా మిగతా ముగ్గురు జంగా గుణ (24), శీలం చలపతి (25), వేమిరెడ్డి సాయి (25) గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు కల్లూరు మండలం బత్తుల పల్లికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పెనుబల్లి, కల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories