నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం

Arun Chilukuri
Published on: 23 Oct 2020 8:15 AM IST
నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం
X

నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపించారు. అంతిమసంస్కారాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ ముఠా కొట్టేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదు అందగానే వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గ్యాంగులో ఒక సభ్యున్ని గుర్తించి పట్టుకున్నారు. నిందితుడి నుండి మూడు వేల రూపాయలు పైగా సొమ్మును రికవరీ చేశారు. మిగతావాళ్లు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story