నిందితులను కటినంగా శిక్షించాలి

నిందితులను కటినంగా శిక్షించాలి
x
నేరెళ్ల శారద
Highlights

వైద్యురాలు ప్రియాంక రెడ్డి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సంతాపం తెలిపారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో కూడా పోల్చలేం అని ఆమె అన్నారు.

రామడుగు: వైద్యురాలు ప్రియాంక రెడ్డి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు నేరెళ్ల శారద సంతాపం తెలిపారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో కూడా పోల్చలేం అని ఆమె అన్నారు. సమాజంలో మహిళగా పుట్టడం నేరమైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకురాలు, ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రియాంక రెడ్డి హత్య ఓక విషాదకరమైన సంఘటన. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని ఆమె అన్నారు.

ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ధైర్యాన్ని అందించాలని కోరుతున్నానని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘాతుకాని పాల్పడిన నిందుతులందరిని వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి ఉరిశిక్షపడేలా చర్యలు తీసుకోవాలని నేరెళ్ల శారద కోరారు. అటు వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనలో కూడా మానస చావుకు కారణమైన వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories