మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

Arun Chilukuri
Updated on: 23 Jan 2021 6:30 PM IST
మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు
X

మే 17 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు


పదో తరగతి వార్షిక పరీక్షలపై స్పష్టత వచ్చింది. ఈసారి మే 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ స్పెష‌ల్ చీఫ్‌ సెక్ర‌ట‌రీ చిత్రా రాంచంద్ర‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఆరు స‌బ్జెక్టుల‌కు 11 ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. కానీ ఈసారి కేవ‌లం ఆరు స‌బ్జెక్టుల‌కు ఆరు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌) టెస్టుల‌కు గానూ రెండు ఎఫ్ఏ టెస్టుల‌ను మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి ఎఫ్ఏను మార్చి 15న‌, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వ‌హించ‌నున్నారు. స‌మ్మేటివ్ అసెస్‌మెంట్‌ను మే 7 నుంచి 13వ తేదీ మ‌ధ్య‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి 9, 10వ త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌నున్నారు. ప‌ది ప‌రీక్ష‌లు ముగిసిన మ‌రుస‌టి రోజు(మే 26) నుంచి జూన్ 13వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story