Telangana: తెలంగాణలో ఆర్టీసీ వేళల పొడిగింపు

Telangana RTc Services
x

TS Rtc File Photo

Highlights

Telangana: తెలంగాణలో కరోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ,...

Telangana: తెలంగాణలో కరోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందిస్తూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైళ్లను తిప్పుతామని తెలిపింది. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది.

మ‌రోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా బ‌స్సు స‌ర్వీసులు పెంచ‌నుంది. ప్రస్తుతం 3,600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతున్నాయని.. వాటినే సాయంత్రం 6 వరకు తిప్పబోతున్నట్టు తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదులోని సిటీ బస్సులన్నీ తిరుగుతాయని వెల్ల‌డించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories