త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..?

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..?
x

త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? 

Highlights

కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్టీసీపై వైరస్ ఎఫెక్ట్ బాగానే పడింది. వేల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది...

కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్టీసీపై వైరస్ ఎఫెక్ట్ బాగానే పడింది. వేల బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది ఆర్టీసీ. తెలంగాణలో మరోసారి ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనను సీఎం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే మిగిలి ఉంది.

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు జనం నెత్తిన పడనుంది. మరోసారి ఛార్జీల పెరుగదలకు ఆర్టీసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ధరల ఏ మేరకు పెంచాలన్న అంశం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కరోనాకి ముందు ఓసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. దీంతో మరోసారి ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా కారణంగా బస్సుల్ని కొన్ని నెలలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత కూడా సర్వీసులు ప్రారంభించిన జనం ఎవరు కరోనా భయంతో బస్సులు ఎక్కలేదు. దీంతో నిర్వహణ ఛార్జీలు, ఉద్యోగుల సాలరీలు చెల్లించడం ఆర్టీసీకి కష్టంగా మారింది.

తెలంగాణ ఆర్టీసీకి రోజుకు 13 కోట్ల దాకా రెవెన్యూ వస్తోంది. లాక్‌డౌన్ సమయంలో 4 నెలలు బస్సులు తిరగలేదు. అయితే సిబ్బందికి జీతాలు మాత్రం చెల్లించక తప్పలేదు. దానికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆర్టీసీని పట్టి పీడిస్తున్నాయి. డీజిల్ రేటు 17 రూపాయలు దాకా పెరిగింది. డీజిల్ రేటు 1 రూపాయి పెరిగినా చాలు ఆర్టీసీపై సంవత్సరానికి 22 కోట్ల భారం పడుతుంది. ఆ ప్రకారం చూస్తే డీజిల్ పెంపు కారణంగా ఆర్టీసీపై 430 కోట్ల భారం పడనుంది.

ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలను పెంచడమే మేలని భావిస్తున్నారు. ఉన్న నష్టాలు మరింతగా పెరుగుతుంటే. ఛార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు ఉద్యోగులు తమ శాలరీలు పెంచాలనీ నిత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని సంస్థపై ఒత్తిడి తెస్తున్నారు. 2019లో ఆర్టీసీ ఉద్యోగులు భారీ సమ్మె చేశారు. అప్పట్లో కిలోమీటర్‌కి 20 పైసలు చొప్పున ఛార్జీలను పెంచారు. హైదరాబాద్ నగరంలో 10,15, 20 రూపాయలు ఇలా రౌండప్ చేసేశారు. దీనిపై అప్పట్లో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడు మరోసారి కిలోమీటర్‌కి 15 పైసలు చొప్పున పెంచాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే సంవత్సరానికి 800 కోట్ల భారం ప్రయాణికులపై పడనుంది. దీంతో ఆర్టీసీ ప్రతిపాదనపై ప్రజల నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఏడాదిన్నర కిందటేగా ఛార్జీలు భారీగా పెంచారు. మళ్లీ ఎందుకీ బాదుడు అని ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా తాము కూడా కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. చాలామంది ఉపాధిని కూడా కోల్పోయారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ తన ప్రతిపాదనను సీఎం వద్దకు పంపింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో ఇప్పట్లో ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల ఉండదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories