Choppadandi: వలస కార్మికులకు మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

Choppadandi: వలస కార్మికులకు మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
x
Highlights

చొప్పదండి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం, ప్రతి వ్యక్తికి 500 రూపాయల పంపిణీ...

చొప్పదండి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం, ప్రతి వ్యక్తికి 500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని, చొప్పదండి మండలం గుమ్లా పూర్ గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్... ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు రేషన్ బియ్యం, డబ్బులు ఇవ్వాలని అన్నారని, దానికి అనుగుణంగా పంపిణీ ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

వలస కార్మికులు ఆకలితో ఆల్మటించకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయలేదని, కనీసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి మానవత్వానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్మికులందరికి పంపిణీ చేస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories