తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా : కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్

తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా : కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్
x
Highlights

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్‌తో...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కల నెరవేర్చిన సోనియాకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. అన్యాయాలు జరిగాయన్న నేతలే నియంత పాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా నేడు జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేస్తుండడంపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇంతకంటే దారుణం మరోటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. శాంతియుతంగా తాము చేయాలనుకున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తమ నేతల ఇళ్ల ముందు ఉన్న పోలీసులు తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories