Achampet: విద్యా శాఖ మంత్రిని కలిసిన అధ్యాపకుల సంఘం

Achampet: విద్యా శాఖ మంత్రిని కలిసిన అధ్యాపకుల సంఘం
x
సబితఇంద్రారెడ్డి
Highlights

అమ్రాబాద్ మండలంలో అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ విద్యాశాఖ మంత్రి సబితఇంద్రారెడ్డిని గురువారం కలిశారు.

అచ్చంపేట: అమ్రాబాద్ మండలంలో అధ్యాపకుల సంఘం రాష్ట్ర కమిటీ విద్యాశాఖ మంత్రి సబితఇంద్రారెడ్డిని గురువారం కలిశారు. ఈ మేరకు 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారని... వారికి 9 నెలలుగా జీతాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. ఈ మేరకు స్పందించిన మంత్రి వెంటనే అతిథి అధ్యాపకులకు జీతాలు ఇవ్వమని అధికారులకు ఆదేశించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గంగాల నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గన్నోజు రామ్మోహన్, తదతరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories