అంబులెన్స్ మంజూరు చేసిన: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

అంబులెన్స్ మంజూరు చేసిన: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
x
Highlights

సబ్ జైల్ కి ఎం‌పి నిధుల నుండి 8,10,487(ఎనిమిది లక్షల పదివేల నాలుగువందల ఎనభై ఏడు) రూపాయలతో అంబులెన్స్ మంజూరుకి ప్రతిపాదన లేఖను జైల్ అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.

హుజూర్ నగర్: సబ్ జైల్ కి ఎం‌పి నిధుల నుండి 8,10,487(ఎనిమిది లక్షల పదివేల నాలుగువందల ఎనభై ఏడు) రూపాయలతో అంబులెన్స్ మంజూరుకి ప్రతిపాదన లేఖను జైల్ అధికారులకు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు టి‌పి‌సి‌సి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ వేల రూపాయలను అంబులెన్స్ ల కొరకు వెచ్చించి ఇబ్బందులు పడుతున్నందున వెంటనే అంబులెన్స్ మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, జైలు అధికారి సీతయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories