సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం

Telangana CM Revanth Reddy Gives Job for Constable Wife
x

సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం

Highlights

Revanth Reddy: కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో సొంగా శేఖర్ మృతి

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రెండేళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం దక్కింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అంబర్‌పేట పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే సొంగా శేఖర్‌ 2021 సెప్టెంబరు 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన భార్య సత్యలత కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఆమె ఏపీ స్థానికురాలనే కారణంతో అభ్యర్థనను తిరస్కరించి నియామకం చేపట్టలేదు. బాధితురాలు ఇటీవల ప్రజావాణిలో సీఎంను కలిసి తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలు సడలించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ రవిగుప్తా, రాచకొండ సీపీ సుధీర్‌బాబును ఆదేశించారు. డీజీపీ సూచన మేరకు సీపీ సుధీర్‌బాబు సత్యలతను కమిషనరేట్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories