Bandi Sanjay Fires on KCR: రాష్ట్రంలో ప్రభుత్వం లేదు... సీఎం ను అందరూ మరిచిపోయారు: బండి సంజయ్

Bandi Sanjay Fires on KCR: రాష్ట్రంలో ప్రభుత్వం లేదు... సీఎం ను అందరూ మరిచిపోయారు: బండి సంజయ్
x
Telangana Bjp Chief Bandi Sanjay fires on KCR Government
Highlights

Bandi Sanjay Fires on KCR: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనీ సీఎం ను రాష్ట్ర ప్రజలందరూ మరిచిపోయారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay fires on KCR: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లేదనీ సీఎం ను రాష్ట్ర ప్రజలందరూ మరిచిపోయారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యం అందించేది ఉస్మానియా హాస్పిటల్ ఒక్కటే అని, కూలీలకు ఇదే ఆధారం అని అన్నారు. అలాంటి ఆస్పత్రిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ 2015 జులై లో సందర్శించారని. అప్పుడు డాక్టర్ లు రోగులు పడుతున్న ఇబ్బందిని చూసి కొత్త హాస్పిటల్ కడతాం అని చెప్పారన్నారు. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేదని.. ఆస్పత్రిని ఎందుకు ఎందుకు కట్టలేదనీ ప్రశ్నించారు. సచివాలయం ,కాళేశ్వరం కేసుల మీద చూపించిన శ్రద్ధ ఉస్మానియా హాస్పిటల్ మీద ఎందుకు చూపించడం లేదన్నారు.

కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండడం తో డాక్టర్లు ,రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బయట మురుగునీరు మొత్తం ఉస్మానియా హాస్పిటల్ లోపలకి చేరుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రయివేటు హాస్పిటల్ లతో కుమ్మక్కై ప్రభుత్వ హాస్పిటల్ లను పట్టించుకోవడం లేదనారు. సీఎం కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్ ని సందర్శించాలని, కరోన ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి హాస్పిటల్ కి వస్తే ప్రజలు నిలదీస్తారని భయపడుతున్నారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories