హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. కిలో ఉల్లి రూ. 35కే

హైదరాబాద్‌వాసులకు శుభవార్త.. కిలో ఉల్లి రూ. 35కే
x
Highlights

నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటగా ఇప్పుడు అదే మార్గంలో ఉల్లిధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఉల్లిని తలచుకంటే చాలు...

నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటగా ఇప్పుడు అదే మార్గంలో ఉల్లిధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఉల్లిని తలచుకంటే చాలు కొన‌కొండానే...కోయ‌కుండానే...కంట‌నీరు తెప్పిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు అనూహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతోంది. దీంతో మొన్నటి వరకు ఠారెత్తించిన ధరలతో పాటు.. ప్రస్తుతం ఉల్లి ఘాటుకు సామాన్యులు సతమతమవుతున్నారు. ప్రస్తుతంకిలో ఉల్లి రేటు రూ.100 దాటింది. అయితే ఈ ఉల్లి ధరలను నియంత్రించేందుకు కొన్ని పలు రాష్ట్రాల మార్కెటింగ్ శాఖలు ధరలపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని చెప్పారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిని కొనుగోలు చేయొచ్చు అని తెలిపారు. లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు.

ఇక చాలా చోట్ల కిలో ఉల్లి ధర రూ. 100కు చేరుకుంది. నెలరోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లి ధర… ప్రస్తుతం ధర మంట పుట్టిస్తోంది. కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ.90లకు పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కిలో ఉల్లి కేవలం రూ. 45 మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories