పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన కీర్తి, శశి

పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన కీర్తి, శశి
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన కీర్తి కేసులో పోలీసులు మరో సంచలన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో కీర్తిని బెదిరించి లొంగదీసుకున్న...

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన కీర్తి కేసులో పోలీసులు మరో సంచలన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో కీర్తిని బెదిరించి లొంగదీసుకున్న శశికుమార్ ప్రధాన సూత్రధారని, ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి, కీర్తితో హత్య చేయించాడని పోలీసులు తేల్చారు.

రజిత హత్య కేసులో ఏ1గా శశికుమార్ పేరును చేర్చినట్టు వెల్లడించారు. ఇటీవల కీర్తికి వివాహం కుదిరిన తరువాత శశికుమార్ బెదిరింపులు మరింతగా పెరిగిపోయాయని, ఆ వీడియోలు, తమ మధ్య ఉన్న బంధం గురించి చేసుకోబోయే వ్యక్తికి చెబుతానని బ్లాక్ మెయిల్ చేయగా, భయపడిన కీర్తి, కన్న తల్లని కూడా చూడకండా రజితను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసును ఛేదించే క్రమంలో సెల్ ఫోన్ వీడియోలు, వాట్స్ యాప్ చాటింగ్, కాల్ డేటా అత్యంత విలువైన సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. బీటెక్ చదివి కూడా జులాయిగా తిరుగుతున్న శశికుమార్, అందంగా ఉన్న కీర్తిని ప్రేమలోకి దింపితే, ఆస్తి కూడా కలిసి వస్తుందని ప్లాన్ వేశాడని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో నిత్యమూ తాగి వచ్చి ఇంట్లో గొడవచేసే తండ్రి వైఖరితో విసుగు చెందిన ఆమె, శశికుమార్ ను పూర్తిగా నమ్మింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories