Sajjanar: తెలంగాణలో విద్యార్థుల సూ*సైడ్పై సజ్జనార్ రియాక్షన్.. ఏం అన్నారంటే


Sajjanar: పరీక్షల్లో తప్పితే జీవితం కోల్పోయినట్లు కాదు కదా..అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో మంగళవారం రిలీజ్ అయిన ఇంటర్...
Sajjanar: పరీక్షల్లో తప్పితే జీవితం కోల్పోయినట్లు కాదు కదా..అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. తెలంగాణలో మంగళవారం రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని మనస్థాపం చెంది ఐదుగురు విద్యార్థులు బలవన్మరనానికి పాల్పడ్డారు. ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సజ్జనార్. విద్యార్థులకు ఓ కీలక సందేశం ఇచ్చారు. చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదనే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి బలవన్మరణాలు జరుగుతున్నాయని అన్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగే ఛాన్స్ ఉన్నా..ఓటమి జీవితానికి అంతంగా భావిస్తుండటం బాధకరమని అన్నారు. అలాగే పరీక్షల్లో పాస్ కాకపోతే మరింత కష్టపడాలని..లోపాలను సరిదిద్దుకుని ముందుకుసాగాలన్నారు. అంతేకానీ అర్ధాంతరంగా మరణిస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. అంతేకాదు ఒక్క పరీక్ష తప్పితే వెంటనే మరో అవకాశం ఉంటుంది. జీవితం ముగిస్తే తిరిగిరాదు కదా అన్నారు. ఫెయిల్ అయితే మళ్లీ పాస్ కావచ్చని పిల్లలను తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. వాళ్లు పాస్ అయ్యారని..నువ్వెందుకు కాలేదని ఎదుటివారితో పోల్చకుండా పిల్లల్లో స్వతహాగా ఉన్న ప్రతిభను గుర్తిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సజ్జనార్ సూచించారు.
పరీక్షల్లో తప్పితే జీవితం సర్వం కోల్పోయినట్లు కాదు కదా!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 23, 2025
చదువు అంటే ర్యాంకులు, మార్కులు కాదనే విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలాంటి బలవన్మరణాలు జరుగుతున్నాయి.
పరీక్షలో ఫెయిల్ అయితే.. ఆ ఓటమిని గుణపాఠంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉన్న.. ఓటమి… pic.twitter.com/rc6rYWgmx7

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



