Sajjala: చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాలి

Sajjala: చంద్రబాబు మౌనంగా ఉంటే నిజం, అబద్ధం అయిపోదు

Jyothi
Published on: 2 Sept 2023 2:14 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
X

Sajjala: చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాలి

Sajjala: చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల ముడుపులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని.. చంద్రబాబు మౌనంగా ఉంటే నిజం, అబద్ధం అయిపోదన్నారు. రెండు కంపెనీల నుంచి 118 కోట్లు ముడుపులు తీసుకుంటే.. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం నిజంకాదా? అని ప్రశ్నించారు. గతంలోనూ రాజకీయం అడ్డుపెట్టుకొని స్టేలు తెచ్చుకున్నాడని.. హవాలా సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలిస్తుంటే.. ఈడీ మౌనంగా ఎందుకు ఉంటుందో అర్థంకావడం లేదన్నారాయన. చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాలన్న సజ్జల.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లీగల్‌గా ప్రయత్నిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story