పోలీసుల అదుపులోకి అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు
ashwathama reddy
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న ఉదయం నుంచి ఆయన బి.ఎన్.రెడ్డి నగర్లోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు మద్దతు తెలిపేందుకు భారీగా పలు పార్టీల నేతలు తరలివస్తుండటంతో క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తీరుపై ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు.
Next Story




