Revanth Reddy: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి సంచలన పిలుపు

Revanth Reddy: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 29 July 2023 4:56 PM IST
Revanth Reddy Visits Flood Affected Areas Uppal and LB Nagar
X

Revanth Reddy: కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్ రెడ్డి సంచలన పిలుపు

Revanth Reddy: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించి.. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులు, కేటీఆర్ విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ధ్వజమెత్తారు. అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవ‌హ‌రిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పిండ ప్రదానం చేయాల‌ని రేవంత్‌ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి శాంతి క‌లుగుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story