Revanth Reddy: కేసీఆర్‌ను చంపాల్సి అవసరం ఎవరికీ లేదు.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?

Revanth Reddy: కేసీఆర్‌ సభకు వస్తే చర్చించేందుకు సిద్ధం

Jyothi
Updated on: 14 Feb 2024 2:30 PM IST
Revanth Reddy Comments On KCR
X

Revanth Reddy: కేసీఆర్‌ను చంపాల్సి అవసరం ఎవరికీ లేదు.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా?

Revanth Reddy: నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని.. అలాంటి ప్రాజెక్టు కూలిపోతే ఎందుకు చూడటానికి రాలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని.. సభకు వస్తే ఎన్ని రోజులు అయినా చర్చించటానికి సిద్ధం అని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం అని.. కేసీఆర్ ను సభకు తీసుకురావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు.

Jyothi

Jyothi

Next Story