Revanth Reddy: మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న రేవంత్‌ బృందం

Revanth Reddy: కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

Shekhar G
Updated on: 13 Feb 2024 4:27 PM IST
Revanth And Team Examining The Sagging Pillars At Medigadda
X

Revanth Reddy: మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న రేవంత్‌ బృందం

Revanth Reddy: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..మేడిగడ్డ ప్రాజెక్టులో డ్యామేజ్ అయిన పిల్లర్లను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంత మేరకు డ్యామేజ్ అయిందనేది అక్కడి అధికారులు రేవంత్ టీమ్‌కు వివరిస్తున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. అనంతరం.. ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశముంది.. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు.


Shekhar G

Shekhar G

Next Story