నేడు హైదరాబాద్ లో ది హన్స్ ఇండియా రిటైల్ రత్నా అవార్డ్స్

నేడు హైదరాబాద్ లో ది హన్స్ ఇండియా రిటైల్ రత్నా అవార్డ్స్
x
The Hans India
Highlights

వాణిజ్య రంగంలో అద్భుత విజయాలు సాధించే సంస్థలు, వ్యక్తులకు ఏటేటా బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులిచ్చి ప్రోత్సహించే ది హన్స్ ఇండియా

వాణిజ్య రంగంలో అద్భుత విజయాలు సాధించే సంస్థలు, వ్యక్తులకు ఏటేటా బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులిచ్చి ప్రోత్సహించే ది హన్స్ ఇండియా ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్ వేదికగా ఈ సారి బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నిజాయితీకి, నిబద్ధతకు, నిష్పాక్షితకు మారుపేరైన ది హన్స్ ఇండియా వాణిజ్య, వ్యాపార రంగాల్లో ప్రతిభను కనబరిచే వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలిచ్చి వారిని ప్రోత్సహించడం ఆనవాయితీగా పెట్టుకుంది. హైదరాబాద్ వేదికగా కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తోంది. ప్రగతి రీసార్ట్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై , రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హాజరవుతున్నారు.

వాణిజ్య రంగంలో పట్టుదలతో విజయాలు సాధిస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిష్టాత్మక జ్యూరీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అనేక రంగాలలో అత్యద్భుతమైన ప్రగతి కనబరచిన వారికి ఈ సత్కారం జరగబోతోంది. ది హన్స్ ఇండియా చేపడుతున్న బిజినెస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఎందరో ప్రతిభావంతులు, ఔత్సాహిక వాణిజ్య వేత్తలకు స్ఫూర్తినిస్తుందని, తమ వ్యాపారావకాశాలు విస్తరించుకునేలా ప్రేరేపిస్తుందని ది హన్స్ ఇండియా నమ్ముతోంది. అవార్డులు సాధించిన ప్రముఖుల స్ఫూర్తితో మరింతమంది వ్యాపార రంగంలోకి రావాలని, కొత్త కంపెనీలు పెట్టాలనీ, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories