Harish Rao: డీఈవోలను తొలగించడం దుర్మార్గమైన చర్య

Harish Rao: దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Sept 2024 1:40 PM IST
Harish Rao
X

Harish Rao

Harish Rao: సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6వేల 2వందల మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని... హరీశ్ రావు X వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని.. జీతాలు అడిగిన ఉద్యోగాలను విధుల నుంచి తొలగించారని అన్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story