PM Narendra Modi: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు..

Narendra Modi: సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Updated on: 12 Nov 2022 6:25 PM IST
PM Narendra Modi Gives Clarity About Singareni Collieries Privatization
X

PM Narendra Modi: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు..

Narendra Modi: సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో RFCL ఫ్యాక్టరీతోపాటు పలు రైల్వే స్టేషన్లను, 3 జాతీయ రహదారుల విస్తరణ పనలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందన్న మోడీ.. ఈ ఫ్యాక్టరీతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇక సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రవేటుపరం చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా కేంద్రానికి 49 శాతం వాటా ఉందని గుర్తు చేశారు. బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story