Smita Sabharwal: హైకోర్టుకు చేరిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం

Smita Sabharwal: తెలంగాణ హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్స్ వ్యవహారం చేరింది. దివ్యాంగుల పై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Aug 2024 1:06 PM IST
Petition In High Court Against IAS Smita Sabharwal
X

Smita Sabharwal: హైకోర్టుకు చేరిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం

Smita Sabharwal: తెలంగాణ హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్స్ వ్యవహారం చేరింది. దివ్యాంగుల పై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వాఖ్యాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్‌పై సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. యూపీఎస్సీ ఛైర్మన్‌కి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు పిటిషనర్‌కు ఉన్న అర్హతను ప్రశ్నించింది. పిటిషనర్ దివ్యాంగురాలు అని కోర్టుకు లాయర్ తెలపగా పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story