Telangana: భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్

Telangana: భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్
x
Highlights

ఓదెల: మండలంలోని అతి పెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ దేవసేన...

ఓదెల: మండలంలోని అతి పెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ దేవసేన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవసేనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం సులబ్ కాంప్లెక్స్, హై మాక్స్ రైటింగ్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామ్మోహన్, ఆర్ ఐ వినయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమార స్వామి, ఆలయ అర్చకులు వీరభద్రయ్య, నరసింహమూర్తి, పంచాక్షరి, భవానీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories