Revanth Reddy: గవర్నర్కు సరైన గౌరవం ఇవ్వడం లేదు.. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్గా కేసీఆర్ మాట్లాడారు..

Revanth Reddy: గవర్నర్కు సరైన గౌరవం ఇవ్వడం లేదు.. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్గా కేసీఆర్ మాట్లాడారు..
Revanth Reddy: గవర్నర్ నిర్ణయాలు, ప్రొటోకాల్ను ఎవరైనా పాటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు.
Revanth Reddy: గవర్నర్ నిర్ణయాలు, ప్రొటోకాల్ను ఎవరైనా పాటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ గవర్నర్కు సరైన గౌరవం ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా గవర్నర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్పై గవర్నర్కు సర్వాధికారాలు ఉన్నాయని చెప్పారు. గతంలో ఉన్న గవర్నర్ ను పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్గా కేసీఆర్ మాట్లాడారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల్లో ఐడియాలజీ లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడిస్తాం అంటే అర్థం ఉంది... తెలంగాణలో లేని బీజేపీని ఓడిస్తాం అంటే ఏమనుకోవాలని అన్నారు. ఒక్క ఎంపీ లేని ఆమ్ఆద్మీ బీజేపీని ఓడిస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు.
ఖమ్మం సభకు కేసీఆర్ మిత్రుడు ఎంఐఎంను ఎందుకు పిలవలేదని రేవంత్ ప్రశ్నించారు. పువ్వాడను గెలిపించింది కాంగ్రెస్సేనని అందుకే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ చేసిన ఆఫర్ ను పువ్వాడ సమర్దించారని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని సీఎల్పీ నేత భట్టి ఎప్పుడో ఆహ్వానించారని చెప్పారు. కేసీఆర్కు 500కోట్లు ఓ లెక్కనా..అని...దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులలో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. షర్మిల పార్టీని ఎన్జీవోగా చూస్తానని తెలిపారు. తెలంగాణతో, తెలంగాణ తల్లితో కేసీఆర్కు సంబంధం లేదన్నారు రేవంత్రెడ్డి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



