తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Nominations In Telangana
x

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Highlights

Telangana: నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయం

Telangana: తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో..నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలని కమలదళం డిసైడ్ అయింది.బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు అగ్రనేతలు హాజరుకానున్నారు. ఇవాళ డీకే అరుణ, ఈటల రాజేందర్ , రఘనందన్‌రావు నామినేషన్ వేయనున్నారు.

రఘనందన్‌రావు నామినేషన్ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరీ హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌‌సభ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న డీకే అరుణ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ పార్టీ ఎంపీ లక్ష్మణ్..డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories