తెలంగాణలో లాక్‌డౌన్‌ అవసరం ప్రస్తుతం లేదు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - కేసీఆర్

No Need of Lockdown in Telangana Said CM KCR | Telangana News
x

తెలంగాణలో లాక్‌డౌన్‌ అవసరం ప్రస్తుతం లేదు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - కేసీఆర్

Highlights

KCR - Telangana Lockdown: రోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని సూచించారు...

KCR - Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని అన్నారు సీఎం కేసీఆర్. వైద్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అన్ని హాస్పిటల్స్‌లో వంద శాతం బెడ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సిఎం నిర్ణయించారు.

ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని అన్నారు సీఎం కేసీఆర్. ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. అదే సందర్భంలో అజాగ్రత్త కూడా పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని కేసీఆర్ ఆదేశించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హోం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్.

ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్య శాఖ అవసరాల కోసం ప్రత్యేకించి కేటాయించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పది వేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో.. డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని ఆయన ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ.. సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని ఆదేశించారు.

రసూల్ పురలో రెండు, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్ పల్లి, మీర్ పేట, పిర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్ లో ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిజామాబాద్‌లో 3, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండం, ఖమ్మం, కరీంనగర్‌లో రెండేసి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్‌లో ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories