కాపురానికి వెళ్ల‌న‌న్న న‌వ వ‌ధువు.. హ‌త్య చేసిన తండ్రి

Newly Married Girl was Killed by her Father in Mahabubnagar
x

కాపురానికి వెళ్ల‌న‌న్న న‌వ వ‌ధువు.. హ‌త్య చేసిన తండ్రి

Highlights

New Bride Killed: మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

New Bride Killed: మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురు కాపురానికి వెళ్లడంలేదని తండ్రి కూతురుతో పాటు భార్యను కూడా చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు సరస్వతిని గత నెల 8న క్రిస్టియన్‌నపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించాడు. కానీ కూతురు కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. నిన్న మధ్యాహ్నాం కూతురిని కాపురానికి పంపాలని భార్యకు సూచించాడు.

కానీ కూతురు కాపురానికి వెళ్లడానికి నిరాకరించడంతో కోపంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. బయటకు వెళ్లి మద్యం తాగొచ్చిన కృష్ణయ్య నిద్రిస్తున్న భార్య, కూతురిపై కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్ నగర్ డీఎస్పీ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు డీఎస్పీ.

Show Full Article
Print Article
Next Story
More Stories