Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Raja Singh: తిరుమలను పవిత్రంగా ఉంచాలన్న రాజాసింగ్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 26 Sept 2024 3:23 PM IST
MLA Raja Singh controversial comments
X

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఎంతో పవిత్రమైనదని.. నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రసాదం అపవిత్రం చేసినవారు తిరుమల ఎందుకు వెళ్తామంటున్నారు. ఇది సరైన నిర్ణయమా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారి తిరిగి అక్కడికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. వారు తిరుమల వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. లడ్డూను అపవిత్రం చేసిన వారు తిరుమల వెళితే హిందువులు అంతా ఏకమై వారిని హతమారుస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story