రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
x
Highlights

మండలం లో జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

కేసముద్రం: మండలం లో జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగాలేదని మొదటి విడత 30 రోజుల లో, రెండవ విడత ఏం చేస్తున్నారని గ్రామ కార్యదర్శి , గ్రామ ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారుల పై అంతా దొంగలే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారం రోజుల తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా గ్రామాన్ని సందర్శిస్తానని మార్పు రాకుంటే ఇంటికేనని అధికారులను హెచ్చరించారు.

గ్రామంలోని పెన్షన్ దారులతో వార్డుల వారీగా కమిటీలను వేసి గ్రామ పారిశుధ్య బాధ్యతలను వారికి అప్పగించాలని, గ్రామపంచాయతీ ముందు ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి అవినీతి అధికారుల పై ఫిర్యాదు చేయాలన్నారు.గ్రామ పాఠశాలల లో చదివిన ప్రతి ఒక్కరూ పాఠశాల, మరియు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం 11 మంది దళితులకు భూ పంపిణీ పత్రాలను, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories