Rangareddy: పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి

Rangareddy: పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా రెడ్డి
x
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విజయలక్ష్మి ప్రవీణ్, జైత్రమ్ నాయక్, గోవర్ధన్ రెడ్డి
Highlights

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.

రంగారెడ్డి: శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేశారో అలాగే పట్టణప్రగతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు పోటీపడి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని లేకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం జరిమానా విదిస్తారని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తానని అన్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య. శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ జైత్రమ్ నాయక్, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories